గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యలో ఎన్నో ఘనతలు సాధించి ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన అనురాగ్ యూనివర్సిటీ తన ఖాతాలో మరో మైలురాయిని నమోదు చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరగబోయే 75 విద్యార్థుల ఉపగ్రహాల మిషన్ (75 Student satilite Mission)లో పాల్గొననుంది.
ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ (ITCA)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 2న బుధవారం నాడు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా ICTAతో ఎంవోయూ కుదుర్చుకున్న మొట్టమొదటి తెలంగాణ విశ్వవిద్యాలయంగా అనురాగ్ విశ్వవిద్యాలయం నిలిచింది. ఈ కార్యక్రమంలో ICTA అధ్యక్షుడే ఎల్వీ మురళీకృష్ణారెడ్డి, ICTA ప్రధాన కార్యదర్శి కె.గోపాలకృష్ణ , TSC టెక్నాలజీస్ ఫౌండర్, ఛైర్మన్ నిఖిల్ రియాజ్ , అనురాగ్ విశ్వవిద్యాలయ ఛాన్సిలర్ యూబీ దేశాయ్, అనురాగ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ సైదా సమీన్ ఫాతిమా,
అనురాగ్ విశ్వవిద్యాలయ సీఈవో శ్రీమతి సూర్యదేవర నీలిమ, డీన్లు, వివిధ విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు.