గాజులరామారంలో స్పోర్ట్స్ పార్కుతో పాటు ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు, చింతల్ భగత్సింగ్ నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్లో ఉన్నాయి. ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందిస్తుంది అని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లండించారు. టీఎస్ఐఐసీ ఏరియా, గాజులరామారం వార్డులోని స్పోర్ట్స్ పార్కును కూడా జీహెచ్ఎంసీ రూ.198.50 లక్షలతో నిర్మించింది.
భగత్ సింగ్ నగర్ లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను రూ.333.65 లక్షలతో నిర్మించారు. ఈ సౌకర్యాలతో పాటు బాచుపల్లి వద్ద రోడ్డు విస్తరణ పనులు, జీడిమెట్ల వద్ద నాలా పనులకు అదేరోజు శంకుస్థాపన చేస్తారు. ప్రకృతి మధ్య గడిపేందుకు అర్బన్ పార్కులు ఉత్తమ గమ్యస్థానాలుగా మారాయని, ఈ పార్కుల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ తో పాటు వివిధ రకాల పక్షలులను చూడొచ్చని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పార్కును ఒక్కో థీమ్ తో అర్బన్ ఫారెస్ట్ లుగా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు.