Anjan Kumar Yadav: బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు.. బట్టేబాజ్ మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjan Kumar Yadav Comments on BJP, Rajgopal Reddy: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తరువాత కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ బీజేపీపై, కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు, బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్మాష్ మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ వాళ్లు దొంగ రామ భక్తులని.. అసలు భక్తుల మేమే అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మోదీ దేవుడన్న సంజయ్.. తెలంగాణకు మీ దేవుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థల్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. బండి సంజయ్ పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఏం చేశావని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది.. దాన్ని ఎవరూ ఖతం చేయలేరని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయారని చెబుతున్న రాజగోపాల్ రెడ్డిని నువ్వేం చేశావని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్ది పాత రికార్డులు తిప్పడం.. ఫోజులు కొట్టడం కాదని విమర్శించారు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
Read Also: Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎలా ఎంపీ అయ్యావని అన్నారు. వైఎస్ఆర్ ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని .. మరి నువ్వేం అంటున్నావని.. కాంగ్రెస్ పార్టీని శవం అంటున్నావు.. శవం దగ్గర ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ సానుభూతితో గెలిచి ఎక్కువగా మాట్లాడుతున్నాడని.. బీజేపీలోకి పోయి మాకు నీతులు చెబుతున్నావా..? అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ కానీ.. ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..