Peddavagu: పెద్దవాగులో చిక్కుకున్న వారందరూ సేఫ్..
- పెద్ద వాగు వరదలో చిక్కుకున్న వారు అంత సురక్షితం..
- రెండు హెలికాప్టర్ ల ద్వారా 51 మంది రెస్క్యూ..
- ఎన్డీఆర్ఎఫ్ బృందం- హెలికాప్టర్ సహాయంతో 51 మంది సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddavagu: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగు భారీగా పొంగిపొర్లడంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదికి కట్టలు కట్టడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునిగిపోతున్నాయి. పెదవాగు వరద నీటిలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు సహా 51 మంది చిక్కుకుపోయారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న ఏపీలోని నారాయణపురం, బచ్చువారిగూడెంకు చెందిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం, హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, చిర్రి బాలరాజు సహాయక చర్యలు చేపట్టారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. కారు వదిలి చెట్లను పట్టుకుని నవ్వుకున్నారు. అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్తులు వారిని రక్షించారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అశ్వారావుపేట పెదవాగు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతం ఏపీకి సమీపంలో ఉన్నందున, మంత్రి ఆ రాష్ట్ర సీఎస్ నిరబ్కుమార్ ప్రసాద్తో మాట్లాడి, అతని అభ్యర్థన మేరకు, నదిలో చిక్కుకున్నవారందరిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఏపీ, తెలంగాణ అధికారులతో సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ను ఆదేశించారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!