Telangana Assembly Session: రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్భవన్లో జరిగింది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు (ఆదివారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా రేవంత్రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నికల లాంఛనం కానుంది.
Read also: America: చైనా కంపెనీల దిగుమతులపై అమెరికా నిషేధం..
Also Read
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
తొలిరోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. మూడో రోజు గవర్నర్ ప్రసంగం జరగనుంది. నాలుగో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాల కారణంగా శాసనసభ చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ ఒరిజినల్, రెండు జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. వాటిని శాసనసభ అధికారులకు అప్పగించాలి. అంతేకాకుండా తమ జీవిత భాగస్వామికి సంబంధించిన రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, నాలుగు ఫొటోలు తీసుకురావాలి. వారి బయోడేటా కూడా ఇవ్వాలి. వారికి ఎమ్మెల్యే విధివిధానాలను వివరిస్తూ కరదీపికను అందజేయనున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే, కేసీఆర్ దూరం..
ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. గతంలో కూడా రాజాసింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. 2018లో అప్పటి సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్గా నియమితులయ్యారు. దీంతో రాజా సింగ్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తుంటి ఎముకకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. నిన్న (శుక్రవారం) తన నివాసంలోని బాత్రూమ్లో జారిపడ్డాడు. దీంతో తుంటి ఎముక విరిగిపోయింది. నిన్న రాత్రి చికిత్స పొందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరుకాలేకపోయారు.
Salaar: సరిగ్గా రెండు వారాల్లో బాక్సాఫీస్ పై దాడి చేయనున్న డైనోసర్…
తాజావార్తలు
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
-
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
-
Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
-
TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!