SR University Hanamkonda: ఎస్ఆర్ యూనివర్సిటీలో దారుణం.. అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SR University Hanamkonda: బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 6వ అంతస్తు నుంచి రేణుశ్రీ ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు మరో విద్యార్థిని సూసైడ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాథోడ్ దీప్తి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీప్తి యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుకుంటుంది. గదిలో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంక్రాంతి హాలిడేస్ కావడంతో అందరూ ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉండటంతో దీప్తి ఇదికి వెళ్లిన స్నేహితులు షాక్ తిన్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకు చేరుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య వేసుకున్న దీప్తి స్వస్థలం అదిలాబాద్ జిల్లాగా గుర్తించారు పోలీసులు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురుగా గుర్తించారు. నిన్న రాత్రి కూడా తోటి విద్యార్థుల తో సాధారణంగానే మాట్లాడిన దీప్తి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి రాకపోవడం డోర్ కొట్టిన తలుపు తియకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా దీప్తి ఉరి వేసుకొని కనిపించింది. నిన్న రాత్రి రూమ్ లో దీప్తి ఒంటరిగా ఉన్నట్లు విద్యార్థినులు తెలిపారు. అర్ధ రాత్రి ఉరి వేసుకొని ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు. దీప్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దీప్తి లాస్ట్ కాల్ ఎవరికి చేసింది. ఎవరితో అయినా చాటింగ్ చేసిందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also Read
Read also: US-UK: హౌతీ తిరుగుబాటుదారులపై దాడి.. జో బైడెన్, రిషి సునాక్ రియాక్షన్ ఇదే..!
ఈనెల 6వ తేదీ సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే రేణుశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే కాలేజీ బిల్డింగ్ ఐదో అంతస్తు పైకి ఎక్కింది. వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. గీతం కాలేజీలో డేఆమె బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. మృతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెగా గుర్తించారు. తనకు ఇష్టమైన చేపల కూర చేయమని తల్లిని కోరిందని తల్లి తెలిపింది. కాలేజీకి వెళ్తున్న తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిసి షాక్కు గురయ్యానని కన్నీరుమున్నీరయ్యారు తల్లిదండ్రులు. అయితే ఆత్మహత్యకు ముందు రేణుశ్రీ తన ఫ్రెండ్ కు ఫోన్ చేసిందని పోలీసులు గుర్తించారు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా మరేదైనా కారణాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Novak Djokovic Cricket: క్రికెట్ ఆడిన టెన్నిస్ స్టార్ జకోవిచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
-
Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!