Weather Today: తెలంగాణలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు..
- తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు..
- ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Today: అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఉదయం 9 గంటలైనా ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు చలికి వణుకుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read also: Burra Venkatesham: గ్రూప్-2 అభ్యర్థులు ఎలాంటి ఆందోళన వద్దు..
Also Read
ఆదిలాబాద్లో 6.2, నిర్మల్లో 8.5, మెదక్లో 10.8, నిజామాబాద్లో 13.8, హైదరాబాద్లో 17.3, భద్రాచలంలో 18.5, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్నగర్ జిల్లాల్లో 18.9 డిగ్రీలుగా నమోదైంది. కాగా, రాష్ట్రంలో రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఉదయం లేవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆస్తమా, గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపారు.
Cabinet Expansion: నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. వీరికే మంత్రి పదవులు..!
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!