Online Betting: ఆదిలాబాద్లో ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
- ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- ఆన్ లైన్ బెట్టింగ్.. పెట్టుబడులతో రూ. 20 లక్షల అప్పు..
- అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి చనిపోయిన ప్రైవేట్ టీచర్ ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Betting: ఆదిలాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎరోడ్రం సమీపంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ లో జూదం, పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన సదరు ప్రైవేట్ ఉపాద్యాయుడు.. సుమారు 20 లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చేసిన అప్పుల భారంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు.
Read Also: Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
Also Read
ఇక, ఈ సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఆదిలాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..