Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
- ఆదిలాబాద్ ఎయిర్ఫీల్డ్కు గ్రీన్ సిగ్నల్
- ₹2,278 కోట్లతో మెగా ప్రాజెక్ట్
- ఉత్తర తెలంగాణకు కొత్త ఊపు
- 2026 నాటికి పనులు పూర్తి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో ‘ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ రూపురేఖలను మార్చే గేమ్చేంజర్గా నిలవడమే కాకుండా ప్రాంతీయ పురోగతికి సరికొత్త శకాని నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
2,009 ఎకరాల్లో అత్యాధునిక ఏవియేషన్ హబ్
మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్లో అత్యాధునిక మౌలిక వసతులను కల్పించనున్నారు. సివిల్ ఏవియేషన్ (సాధారణ విమాన ప్రయాణాలు) తో పాటు కార్గో రవాణా, ఎంఆర్ఓ (Maintenance, Repair, and Overhaul) సదుపాయాలను ఇక్కడ ఏకకాలంలో అందుబాటులోకి తేనున్నారు. రక్షణ రంగంతో పాటు పౌర విమానయాన అవసరాలను తీర్చేలా ఈ ప్రాజెక్ట్ను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నారు.
Also Read
- Bandi Sanjay : 'జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి'.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
- Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
- Kishan Reddy : కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- Harish Rao : డాక్టర్ మమతకు హరీష్ రావు సెల్యూట్.. 'దేవుళ్లు ఎందుకంటారో నిరూపించారు.!'
పారిశ్రామిక, పర్యాటక రంగాలకు విపరీతమైన ఊతం
ఈ ఎయిర్ఫీల్డ్ అందుబాటులోకి రావడం వల్ల ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు బాటలు పడనున్నాయి. ముఖ్యంగా కార్గో సదుపాయం కలగడం వల్ల ప్రాంతీయ వ్యాపార, వాణిజ్య రంగాలు పుంజుకోవడంతో పాటు పర్యాటక రంగానికి విశేష ప్రజాదరణ లభించనుంది. రక్షణ , పౌర విమానయాన రంగాలు ఒకే చోట చేరడం ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
2026 డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి భూసేకరణ , అవసరమైన మౌలిక వసతుల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్లే ఉత్తర తెలంగాణ సుదీర్ఘ కల నెరవేరుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
-
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!