Siddipet: ఇంటిదోషం తొలగిస్తానని నగలతో ఉడాయించిన హిజ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet: మూఢనమ్మకాలు మనషులకు పట్టి పీడుస్తున్నాయి. మూఢనమ్మానికి బానిసలై జీవితాలను నాసనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ఆసరాగా తీసుకుని ఎదుటివారు సులువుగా మోసం చేస్తున్నారు. దోషాలు, వివాహాలు, డబ్బు ఆశ చూపించడం ఇలా రకరకాలుగా వారిని భయభ్రాంతులు చేసి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేసుకుంటున్నారు. ఎదుటి వారు చెప్పేది నిజమా? అపద్దమా అనే ఆలోచన లేకుండా వారి మాటలకు తానా అంటే తందానా అనే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. చేతులు కాలాక ఆకుటు పట్టుకున్న లాభం లేదని మరిచిపోతున్నారు. అంతా ఖాళీ అయ్యాక చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా చేర్యాలలో చోటుచేసుకుంది. ఇంటి దోషం తొలగిస్తానని ఓ హిజ్రా నగలతో ఉడాయించిన ఘటన చేర్యాలలో సంచలనంగా మారింది.
Read also: Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
చేర్యాలకు చెందిన మధు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఏపీలోని విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో కొన్నాళ్లుగా పరిచయం ఏర్పడింది. ఓ సారి చేర్యాలలోని ఇంటికి మస్తాన్ ని మధు తీసుకెళ్లాడు. ఇంటిని చూసిన మస్తాన్ హిజ్రా ఓ ప్లాన్ వేశాడు. ఇంటిని అంతా గమనించి, ఇంట్లో నగలు, వెండిని చూసి ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం వెయిట్ చేశాడు. సమయం రానే వచ్చింది. ఇంట్లో దోషముందని, అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దోషం పోతుందని మధుని.. హిజ్రా మస్తాన్ నమ్మించాడు. దీంతో హిజ్రాను నమ్మిన మధు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 5 తులాల వెండి గొలుసులు తీసి విగ్రహానికి పెట్టి హిజ్రా మస్తాన్ పూజ చేశారు. పూజ అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పాతి పెట్టి నగలను తీయాలని నమ్మించి మధుని ఓ చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు.
మధుని గుడి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి హిజ్రా మస్తాన్ నగలతో ఉడాయించాడు. వెనక్కి తిరిగి మధు చూడగా అక్కడ హిజ్రా కనపించలేదు. చుట్టుపక్కల వెతికిన హిజ్రా జాడ లేకపోవడంతో మోసపోయానని నమ్మిన మధు పోలీసులకు ఆశ్రయించాడు. తనను హిజ్రా మోసం చేసి నగలతో పరారయ్యాడని వాపోయాడు. తను ఎంతో కష్టపడిన సొమ్మును హిజ్రా మస్తాన్ నమ్మించి తీసుకుపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొమ్మును తనకు ఇప్పించాలని, హిజ్రాకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రా మస్తాన్ ఎక్కడ ఉండే వాడని? ఎందుకు మధునే టార్గెట్ చేశాడని? మస్తాన్ వెనుకాల ఇంకెవరిదైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!