Mahabubabad crime: అయ్యో తల్లీ ప్రసవం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయావా.. ఆసుపత్రి వద్ద ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad crime: మహబూబాబాద్ జిల్లా మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ప్రసవం కోసం వెళ్లి నిండు గర్భణీ ప్రాణాలు కోల్పోయింది. సాధారణ కాన్పు చేస్తానని ఆపరేషన్ చేయకుండా నొప్పులతో బాధ పడుతును ఆమెను అలాగే వదిలేసారు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. నిండు గర్భణీ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రాణాలు వదిలిందని ఆసుప్రతి వద్ద ఆందోళన చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన వడ్డురి భాగ్యలక్ష్మి ప్రసవం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. అయితే అక్కడున్న మరిపెడ లో వైద్యం అందించిన డాక్టర్ రవి సాధారణ ప్రసవం చేస్తానని భాగ్యలక్ష్మి నొప్పులు వస్తున్నా అస్సలు పట్టించుకోలేదు. ఆమెకు వైద్యం కూడా చేయాలేదు. దీంతో భాగ్యలక్ష్మికి తీవ్ర నొప్పులతో అక్కడికక్కడే మృతి చెందింది. సాధారణ ప్రసవ ఆపరేషన్ వికటించి మెరుగైన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిపెడ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ రవి నిర్లక్ష్యం తోనే ఆమె చనిపోయిందని బంధువుల ఆరోపణ చేశారు. మృతదేహంతో జాతీయ రహదారి పై ధర్నా చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.
Also Read
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
- Operation Muskaan : 'ఆపరేషన్ ముస్కాన్' సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
మృతురాలు స్థానిక మరిపెడ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కూతురు రెండవ కాన్పుగా తల్లిగారింటికి వచ్చిందని బంధువులు తెలిపారు. అయితే.. సాధారణ హెల్త్ చెకప్ కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో డాక్టర్ల అత్యుత్సాహంతో సాధారణ కాన్పు చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసారని ఆరోపణ చేశారు. మరిపెడలో వైద్యం అందించిన డాక్టర్ రవి.. మరిపెడ మున్సిపల్ ఛైర్మెన్ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు సిందూర భర్త కావడం గమనార్హం. బంధువులు ఎలాంటి సంఘటనలకు పాల్పడకుండా అధికార నేతలతో డాక్టర్ పైరెవిలు చేయిస్తు్న్నారని ఆరోపణలు చేసారు. దీంతో అక్కడ పరిస్థితి ఉత్కంఠగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మృతురాలి బంధులు నిలదీశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని మండిపడ్డారు. తక్షణలో న్యాయం చేయాలని డాక్టార్ రవిని కఠినంగా శిక్షించాలని కోరారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీయమని బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Hardik Pandya: గర్ల్ఫ్రెండ్తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్తో షాక్..!
-
Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్గా పని కనిచేస్తున్న రాజమౌళి
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!