Medak Crime: రెండో భార్య మోజులో పడి మొదటి భార్యను కడతేర్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండో భార్య మోజులో పడిన భర్త మొదటి భార్యను కడతేర్చిన ఘటన సంచలనంగా మారింది. మెదక్ (మం) తిమ్మక్కపల్లి తండాలో రమేష్ స్వరూపకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులు ఆనందంగా వున్న వీరి జీవితంలో అక్రమ సంబంధం అనే భూతం వీరిద్దరిని గొడవలకు దారితీసింది. భర్త వేరే స్త్రీ మోజులో పడి భార్యతో గొడవలకు దిగాడు. ఈ గొడవలు కాస్తా చిలికి చిలికి గాలివానై భర్త రెండో పెళ్లికి సిద్దమయ్యేలా దారులు తీసాయి. రమేష్, స్వరూపకి పదేళ్ల క్రితం వివాహమైన భర్త రమేష్ ఇటీవల మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి తర్వాత రమేష్, స్వరూప మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో రమేష్, మొదటి భార్య స్వరూపపై కోపంతో ఊగిపోయాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకుని రెండో భార్యతో గడపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఈ నెల 6న పొలం పనుల కోసమని స్వరూపని బావి దగ్గరకు తీసుకెళ్లాడు. బావి దగ్గరకు ఎందుకు తీసుకు వచ్చావు అని అడగగా మాట మాట కలిపాడు. ఏమీ లేదంటూ అక్కడే ప్లాన్ ప్రకారం పురుగుల మందు డబ్బాను చేతిలో తీసుకున్నాడు. భయంతో స్వరూప అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే స్వరూపను రమేష్ గట్టిగా పట్టుకుని బలవంతంగా పురుగుల మందు తాగించాడు.
Read also: Bhola Shankar Review: భోళాశంకర్ రివ్యూ
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
వద్దని వదిలేయాలని బ్రతిమలాడినా అస్సలు చెవిన వేసుకోలేదు. ప్రాధేయ పడ్డా పరుగుల మందు ఆమె నోట్లో వేశాడు. దీంతో స్వరూప కడుపు మంటతో కిందపడి విల విల లాడుతూ ప్రాణాలతో కొట్టుకుంది. అయితే.. రమేష్ చాకచక్యంగా స్వరూప తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని నమ్మించాడు. ఆమెను ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకువెళ్లి పురుగుల మందు తాగిందని వెంటనే చికిత్స చేయాలని నటించాడు. ఈ నెల 9న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. స్వరూప తనంతకు తాను పురుగుల మందు తాగలేదని తల్లితండ్రులు గ్రహించారు. భర్త రమేష్ ఆమెను బలవంతంగా తాగించడంతోనే తన కూతురు మృతి చెందిందని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. రమేష్ ను అదుపులో తీసుకున్నారు. రెండో భార్యను కూడా అదుపులో తీసుకుంటామని తెలిపారు. మొదటి భార్య వుండగానే రెండో పెళ్లి చేసుకున్నా రమేష్, రెండో భార్యను కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Central Government : ఆన్లైన్లో మెడిసిన్స్.. జాతీయ పోర్టల్ను ప్రారంభించనున్న కేంద్రం…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!