Siddipet: ఇంటిదోషం తొలగిస్తానని నగలతో ఉడాయించిన హిజ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet: మూఢనమ్మకాలు మనషులకు పట్టి పీడుస్తున్నాయి. మూఢనమ్మానికి బానిసలై జీవితాలను నాసనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ఆసరాగా తీసుకుని ఎదుటివారు సులువుగా మోసం చేస్తున్నారు. దోషాలు, వివాహాలు, డబ్బు ఆశ చూపించడం ఇలా రకరకాలుగా వారిని భయభ్రాంతులు చేసి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేసుకుంటున్నారు. ఎదుటి వారు చెప్పేది నిజమా? అపద్దమా అనే ఆలోచన లేకుండా వారి మాటలకు తానా అంటే తందానా అనే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. చేతులు కాలాక ఆకుటు పట్టుకున్న లాభం లేదని మరిచిపోతున్నారు. అంతా ఖాళీ అయ్యాక చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా చేర్యాలలో చోటుచేసుకుంది. ఇంటి దోషం తొలగిస్తానని ఓ హిజ్రా నగలతో ఉడాయించిన ఘటన చేర్యాలలో సంచలనంగా మారింది.
Read also: Photoshoot: పురుషుల నగ్నత్వాన్ని చిత్రీకరిస్తున్న మహిళ
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
చేర్యాలకు చెందిన మధు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఏపీలోని విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో కొన్నాళ్లుగా పరిచయం ఏర్పడింది. ఓ సారి చేర్యాలలోని ఇంటికి మస్తాన్ ని మధు తీసుకెళ్లాడు. ఇంటిని చూసిన మస్తాన్ హిజ్రా ఓ ప్లాన్ వేశాడు. ఇంటిని అంతా గమనించి, ఇంట్లో నగలు, వెండిని చూసి ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం వెయిట్ చేశాడు. సమయం రానే వచ్చింది. ఇంట్లో దోషముందని, అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దోషం పోతుందని మధుని.. హిజ్రా మస్తాన్ నమ్మించాడు. దీంతో హిజ్రాను నమ్మిన మధు ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, 5 తులాల వెండి గొలుసులు తీసి విగ్రహానికి పెట్టి హిజ్రా మస్తాన్ పూజ చేశారు. పూజ అనంతరం అమ్మవారి విగ్రహాన్ని పాతి పెట్టి నగలను తీయాలని నమ్మించి మధుని ఓ చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు.
మధుని గుడి దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి హిజ్రా మస్తాన్ నగలతో ఉడాయించాడు. వెనక్కి తిరిగి మధు చూడగా అక్కడ హిజ్రా కనపించలేదు. చుట్టుపక్కల వెతికిన హిజ్రా జాడ లేకపోవడంతో మోసపోయానని నమ్మిన మధు పోలీసులకు ఆశ్రయించాడు. తనను హిజ్రా మోసం చేసి నగలతో పరారయ్యాడని వాపోయాడు. తను ఎంతో కష్టపడిన సొమ్మును హిజ్రా మస్తాన్ నమ్మించి తీసుకుపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొమ్మును తనకు ఇప్పించాలని, హిజ్రాకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రా మస్తాన్ ఎక్కడ ఉండే వాడని? ఎందుకు మధునే టార్గెట్ చేశాడని? మస్తాన్ వెనుకాల ఇంకెవరిదైనా హస్తం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Mukesh Ambani: లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముకేశ్ అంబానీ..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!