A Girl Commits Suicide In Rayadurgam After Cheated By Purnachander In The Name Of Movie Offers: రంగుల ప్రపంచమైన సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఒక్కసారి క్లిక్ అయితే.. ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఒక సెలెబ్రిటీగా జీవితాన్ని లీడ్ చేయడంలో ఉండే కిక్కే వేరు. అందుకే.. సినిమాల్లో రాణించాలని ఎంతోమంది ఈ ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే.. ఈ సినిమాలపై ఉన్న మోజుని కొందరు దుండగులు క్యాష్ చేసుకుంటుంటారు. తమకు పడకసుఖాన్ని అందిస్తే, తప్పకుండా ఆఫర్లు ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిల్ని లొంగదీసుకుంటారు. తీరా కోరిక తీరాక, వారిని రోడ్డున వదిలేస్తారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాంటి దారుణమైన మోసాన్నే ఎదుర్కొంది. తనకు ఆఫర్లు ఇప్పిస్తాడన్న నమ్మకంతో ఒక వ్యక్తికి తన సర్వస్వాన్ని సమర్పిస్తే, అతడు మోసం చేశాడు. దీంతో అవమానంగా భావించిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరం ఉంది
ఆ యువతి పేరు బిందు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. హీరోయిన్లను చూసి, తాను కూడా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకుంది. అంతే.. ఇండస్ట్రీలో ప్రయత్నాల కోసం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు పూర్ణచందర్ అనే వ్యక్తి తగిలాడు. తనకు ఇండస్ట్రీలో మంచి పేరుందని, తనకు ఎందరో దర్శకనిర్మాతలు తెలుసని పరిచయం నమ్మబలికాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావని, హీరోయిన్గా తప్పకుండా ఎదుగుతావని ఆశ పెట్టాడు. అయితే.. ఛాన్సులు ఇప్పించాలంటే, తన కోరిక తీర్చాలని కోరాడు. తనకు సినిమా ఆఫర్లు వస్తాయన్న నమ్మకంతో.. పాపం ఆ యువతి అతని మాటలు నమ్మి సర్వస్వం సమర్పించింది. అతనితో సహజీవనం చేసింది. కోరిక తీరినప్పటి నుంచి.. అదిగో, ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు కానీ, ఆమెకు ఛాన్సులు ఇప్పించలేదు. పైగా.. ఈమధ్య మరో యువతితో తిరగడం మొదలుపెట్టాడు. ఇది చూసిన బిందు.. తాను మోసపోయానని భావించి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ బాధలోనే.. రాయదుర్గంలోని 21 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Karumuri Nageswara Rao : సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్