Satyavathi Rathod: సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు.. కారణం అదే అంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: వరంగల్ జిల్లా మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘన దృష్ట్యా మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూడూరు మండలం కొంగరగిద్దె గ్రామంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్కు స్థానిక మహిళలు మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. దీంతో మంత్రి మంగళ హారతిలో డబ్బులు పెట్టి ముందుకు కదిలారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. మంగళ హారతిలో రూ.4వేలు డబ్బులు పెట్టినట్టు తేలడంతో.. విషయం వెలుగులోకి రావడంతో మంత్రి సత్యవతి రాథోడ్పై ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐపీసీ 171-ఈ, 171–హెచ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నప్పటికీ వివిధ పార్టీల నేతలు పెద్దగా లెక్కలు వేయడం లేదు. ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం వరకు ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫొటోలున్న టిఫిన్ బాక్స్ బ్యాగులు, చీరలు, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పరకాల నియోజకవర్గంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నడుపుతూ ఓ ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్తో పాటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఉల్లంఘనలు పెరిగిపోతుండగా జిల్లాలో ఇప్పటి వరకు వివిధ రూపాల్లో అధికారులకు 1,393 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 1950లో అత్యధికంగా 1,181 ఫిర్యాదులు అందాయి. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1816లో 69, సీ విజిల్ యాప్లో 76, ఇతర సమస్యలపై 67 ఫిర్యాదులు అందాయి. 1,393 ఫిర్యాదులు దాదాపుగా పరిష్కరించామని, కేవలం ఒక ఫిర్యాదు మాత్రమే విచారణలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినా నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
IND vs AUS Final: పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్ సిటీ
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?