Satyavathi Rathod: సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు.. కారణం అదే అంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: వరంగల్ జిల్లా మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘన దృష్ట్యా మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూడూరు మండలం కొంగరగిద్దె గ్రామంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్కు స్థానిక మహిళలు మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. దీంతో మంత్రి మంగళ హారతిలో డబ్బులు పెట్టి ముందుకు కదిలారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. మంగళ హారతిలో రూ.4వేలు డబ్బులు పెట్టినట్టు తేలడంతో.. విషయం వెలుగులోకి రావడంతో మంత్రి సత్యవతి రాథోడ్పై ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐపీసీ 171-ఈ, 171–హెచ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నప్పటికీ వివిధ పార్టీల నేతలు పెద్దగా లెక్కలు వేయడం లేదు. ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం వరకు ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫొటోలున్న టిఫిన్ బాక్స్ బ్యాగులు, చీరలు, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పరకాల నియోజకవర్గంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నడుపుతూ ఓ ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్తో పాటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఉల్లంఘనలు పెరిగిపోతుండగా జిల్లాలో ఇప్పటి వరకు వివిధ రూపాల్లో అధికారులకు 1,393 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 1950లో అత్యధికంగా 1,181 ఫిర్యాదులు అందాయి. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1816లో 69, సీ విజిల్ యాప్లో 76, ఇతర సమస్యలపై 67 ఫిర్యాదులు అందాయి. 1,393 ఫిర్యాదులు దాదాపుగా పరిష్కరించామని, కేవలం ఒక ఫిర్యాదు మాత్రమే విచారణలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినా నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
IND vs AUS Final: పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్ సిటీ
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
తాజావార్తలు
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?