Satyavathi Rathod: సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు.. కారణం అదే అంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod: వరంగల్ జిల్లా మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘన దృష్ట్యా మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూడూరు మండలం కొంగరగిద్దె గ్రామంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్కు స్థానిక మహిళలు మంగళహారతి పట్టి స్వాగతం పలికారు. దీంతో మంత్రి మంగళ హారతిలో డబ్బులు పెట్టి ముందుకు కదిలారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు వీడియో ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. మంగళ హారతిలో రూ.4వేలు డబ్బులు పెట్టినట్టు తేలడంతో.. విషయం వెలుగులోకి రావడంతో మంత్రి సత్యవతి రాథోడ్పై ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐపీసీ 171-ఈ, 171–హెచ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తున్నప్పటికీ వివిధ పార్టీల నేతలు పెద్దగా లెక్కలు వేయడం లేదు. ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం వరకు ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫొటోలున్న టిఫిన్ బాక్స్ బ్యాగులు, చీరలు, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పరకాల నియోజకవర్గంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నడుపుతూ ఓ ఎమ్మెల్సీపై కేసు నమోదైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకులు అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్తో పాటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా ఉల్లంఘనలు పెరిగిపోతుండగా జిల్లాలో ఇప్పటి వరకు వివిధ రూపాల్లో అధికారులకు 1,393 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 1950లో అత్యధికంగా 1,181 ఫిర్యాదులు అందాయి. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1816లో 69, సీ విజిల్ యాప్లో 76, ఇతర సమస్యలపై 67 ఫిర్యాదులు అందాయి. 1,393 ఫిర్యాదులు దాదాపుగా పరిష్కరించామని, కేవలం ఒక ఫిర్యాదు మాత్రమే విచారణలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినా నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
IND vs AUS Final: పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్ సిటీ
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!