BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLAs: బీజేపీ అభ్యర్థి, ఇద్దరు ఎమ్మెల్యేలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిన్న రోడ్ షోలో పర్మిషన్ ఇచ్చిన సమయాన్ని దాటి ప్రచారం చేసినందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి గోడం నగేష్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేందర్ బీజేపీ మండల పార్టీ కన్వీనర్ లపై VST (వీడియో సర్వేలెన్సు టీం) ఇన్చార్జి ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఖానాపూర్, ఇచ్చోడలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, రితీష్ రాథోడ్ పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా ఫేక్ వీడియోలు సృష్టించారని ఆరోపించారు.
Read also: Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, అధికారం కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు జరిగినట్టే రేవంత్ రెడ్డికి కూడా జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రచారంలో అధికారులు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం ప్రచారానికి కేటాయించారని వీఎస్ టీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేశారు.
Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తాజావార్తలు
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?