BRS KTR: కేటీఆర్పై బంజారాహిల్స్ లో కేసు నమోదు.. కారణం ఇదీ..!
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలుపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్టేషనల్ లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీసులు పంపారు. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
తాజాగా.. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలలు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని, వసూలు చేసిన రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేగులు కోసుకుని మెడలో వేసుకుంటానని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ కు సీఎంగా పని చేసేంత తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు.
Read also: Pawan Kalyan Pithapuram Tour: జనసేనాని పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు..
ఫోన్ ట్యాపింగ్, మోసాల పేరుతో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సమావేశంలో ప్రశ్నించారు. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, అది నిజమే కాబట్టి బీజేపీలో చేరడంపై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు, బాధ్యతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు హనుమకొండ పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫిర్యాదును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Delhi Liquor Policy: లిక్కర్ స్కాం కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు..
- Tags
- BRS
- ktr
- Telangana Politics
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!