BRS KTR: కేటీఆర్పై బంజారాహిల్స్ లో కేసు నమోదు.. కారణం ఇదీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలుపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్టేషనల్ లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీసులు పంపారు. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
తాజాగా.. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలలు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని, వసూలు చేసిన రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేగులు కోసుకుని మెడలో వేసుకుంటానని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ కు సీఎంగా పని చేసేంత తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు.
Read also: Pawan Kalyan Pithapuram Tour: జనసేనాని పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు..
ఫోన్ ట్యాపింగ్, మోసాల పేరుతో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సమావేశంలో ప్రశ్నించారు. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, అది నిజమే కాబట్టి బీజేపీలో చేరడంపై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు, బాధ్యతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు హనుమకొండ పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫిర్యాదును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Delhi Liquor Policy: లిక్కర్ స్కాం కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు..
- Tags
- BRS
- ktr
- Telangana Politics
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?