హైదరాబాద్ – శ్రీశైలం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో అచ్చపేట మండలం చెన్నారం గేట్ దగ్గర శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు విడిచారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఇక, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి సీఎం.. ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు.. తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.