ఏడో విడత హరితహారం.. 20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు నాటడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. చెట్లు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతను కూడా సీరియస్గా తీసుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు విడతలుగా హరితహారం నిర్వహించగా… ఏడో విడతకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం… ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలు… నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 2015లో ప్రారంభమైంది హరితహారం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241గా ఉండగా… అందుబాటులో ఉన్న మొక్కల సంఖ్య సుమారు 25 కోట్లుగా చెబుతున్నారు.. ఈసారి బహళ రహదారి వనాలకు (మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయితీ రోడ్ల వెంట బహుళ వనాలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.. వీలున్న ప్రతీ చోటా యాదాద్రి (మియావాకీ) మోడల్ లో చెట్లు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.. ఇక, ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి.., పెంచే బాధ్యత ఆయా కుటుంబాలకు అప్పగించనున్నారు.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని నిర్ణయానికి వచ్చారు..
జులై 1 నుంచి 10 దాకా పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది ప్రభుత్వం.. ప్రతీ ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్దరణకు చర్యలు తీసుకోనున్నారు.. అటవీ బ్లాకుల వారీగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అటవీ పునరుద్దరణ ప్రణాళికలు చేపట్టనున్నారు.. పటిష్ట చర్యలు, పర్యవేక్షణ ద్వారా అటవీ భూములు, సంపద రక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు.. దీనికోసం ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కలు నాటే మిగతా శాఖలకు సాంకేతిక సహకారాన్ని అటవీ శాఖ అందించనుంది.. ప్రతీ విద్యా సంస్థ, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవాలని.. ప్రతీ మండల కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో పెద్ద ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని.. ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.. అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.. గత ఆరు విడతల్లో నాటిన మొక్కలు మొత్తం 220.70 కోట్లు కాగా.. అడవుల బయట 159.88 కోట్ల మొక్కలు.. అడవుల లోపల 60.81 కోట్ల మొక్కలు నాటారు.. హరితహారం కోసం ఇప్పటిదాకా అయిన ఖర్చు (అన్ని శాఖలు కలిపి) 5,591 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక (2019) ప్రకారం రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరుగుదల నమోదైంది.. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది జరగగా.. ఇప్పటికే పూర్తయిన పార్కులు – 53 ( 35 ప్రజలకు అందుబాటులోకి, 18 రెడీగా ఉన్నాయి.)గా ఉన్నాయి.. మిగతా 56 అర్బన్ ఫారెస్ట్ పార్కులను రానున్న ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!