Komatireddy Venkat Reddy Deeksha: భూ నిర్వాసితుల కోసం 72 గంటల దీక్ష.. ఎంపీ కోమటిరెడ్డి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూ నిర్వాసితుల కోసం త్వరలో 72 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268లో భూమిని కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు.. గతంలో భూనిర్వాసితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఆయన.. నేడు రైతు పోరాట సమితికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు..
Read Also: Constable Rape: దారుణం.. అర్ధరాత్రి నడిరోడ్డుపై మెడికోపై పోలీస్ అత్యాచారం..?
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
రైతులకు మద్దతుగా త్వరలోనే 72 గంటల దీక్ష నిర్వహిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి.. శాంతియుతంగా నేను పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశా.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకోసం మరోసారి దీక్ష చేస్తా అన్నారు. రైతులు పోరాటాన్ని మధ్యలో ఆపొద్దు.. మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఆయన.. మీరు చెప్పిన మాటనే నిలబెట్టుకోవాలన్నారు.. ఇక, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదని మండిపడ్డ ఆయన.. భువనగిరి ప్రాంతంలో 32 లక్షల నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం రూ.7.15 లక్షలే ఇచ్చారన్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను నియోజవర్గంలో తిప్పటం కాదు ప్రజలకు న్యాయం చేయండి.. 15 రోజుల సమయం ఇస్తున్న రైతులకు న్యాయం చేయండి లేదంటే మేమే మీపై యుద్ధం చేస్తాం అని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.
తాజావార్తలు
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!