TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసుపై 4వ రోజు విచారణ.. యూజర్ ఐడి, పాస్ వర్డ్ పై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: TSPSC ప్రశ్నపత్రాల పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. పేపర్ లీకేజ్ కేసు రోజుకో ములుపు తిరుగుతుంది. TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితుల నాలుగో రోజు కస్టడీ విచారణ చేపట్టనుంది. మరికాసేపట్లో హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ లో 9మంది నిందితుల విచారణ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ని ఎవరెవరికి ఇచ్చారనే విషయం పై ఆరా తీయనున్నారు. నలుగురు ఎన్అర్ఐ లు వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసారని గుర్తించిన అధికారులు వారిని ఫోన్ లోనే సిట్ విచారించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్ తీసుకున్నారు. ప్రవీణ్ కి తెలియకుండా రేణుక మరికొంత మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు అధికారులు. TSPSC పేపర్ తీసుకున్న వారిని గుర్తించి, వారిపైన కేసులు నమోదు చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి వెళ్లనున్నారు. సిస్టమ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ పై విచారణ చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ జరిగాయి అనేదానిపై సిట్ విచారణ చేయనుంది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సిట్ సోదాలు వ్యవహరించింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు విచారణ సాగుతుంది.
Read also: MLC Kavitha ED Live: ప్రముఖ అడ్వకేట్ తో కవిత సంప్రదింపులు
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
కాగా.. CD ఇంచార్జ్ శంకర్లక్ష్మీ డైరీ నుంచి కొట్టేశామన్నారు నిందితులు. అయితే, నిందితులు చెప్పేది అబద్ధమని సిట్ అంటోంది. అయితే.. ఐడీ, పాస్ వర్డ్ గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో రాజశేఖర్, ప్రవీణ్ను విడి విడిగా విచారించినట్లుగా సమాచారం. ఇక.. మరో నిందితురాలు రేణుక కోసమే ప్రవీణ్ ఏఈ పేపర్ లీక్ చేసాడనేది అబద్ధమంటోంది సిట్. అయితే.. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ అయినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రవీణ్ బంధువులు, స్నేహితుల్లో పోటీ పరీక్షలు రాసే వారికోసం ప్రవీణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలో.. డబ్బులు ఇస్తే పేపర్ లీక్ చేస్తానని అభ్యర్థులతో ప్రవీణ్ మాట్లాడినట్లుగా సిట్ సందేహం వ్యక్తం చేస్తూ.. అదే కోణంలో విచారణ చేస్తోంది. ఇక ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోమవారం సోదాలు చేసిన సిట్ పేపర్లకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.
Read also: APSRTC CARGO: APSRTC మరో ముందడుగు.. ఇక డోర్ టు డోర్ కార్గో సేవలు
ఇది ఉండగా.. గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ను ఏకంగా ఉగాది పండుగ రోజే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. TSPSC పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రేవంత్ తనతో పాటు మంత్రి కేటీఆర్కు నోటీసులిస్తే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానంటు తెలిపారు. ఉగాది షడ్రుచుల పండుగ రోజు టీఎస్పీఎస్సీ ఎపిసోడ్ ఎంత హీటెక్కిస్తుందో వేచి చూడాలి. మరి ఇవాల సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించనుందో.. ఎవరెవరి పేర్లు ఇంకా బయటకు రానున్నాయో అనేదానిపై అందరిలో ఉత్కంఠ మారింది.
Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!