బాసరలో అక్రమాలు.. సర్కార్ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసర దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సర్కార్ చర్యలు చేపట్టింది. 2017 సంవత్సరంలో వివిధ రూపాల్లో జరిగిన అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఓవైపు దేవాదాయశాఖ, మరోవైపు ఏసీబీ అక్రమాలపై విచారణ చేపట్టింది. నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది. అప్పటి బాసర ఏఈవో గంగాశ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శైలేష్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు. ఎలక్ట్రీషియన్ కాంతారావు, కంప్యూటర్ ఆపరేటర్గా పని చేసిన రజనికుమారీలను సర్వీస్ నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బాసర దేవాలయంలో జరిగిన అక్రమాలపై 2020లో ఏసీబీ సైతం కేసు నమోదు చేసింది. గతంలోనే ఏడుగురిపై కేసు నమోదైంది. అప్పటి ఈవో సుధాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ సాయిలు…ప్రైవేట్ ఏజెన్సీలకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు అధికారులు. ఐతే…అప్పటి ఈవో, సూపరింటెండెంట్ రిటైర్డ్ కాగా ఉద్యోగులైన నలుగురిపై ఇప్పుడు వేటు వేశారు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆదారంగా దేవాదాయశాఖ నలుగురిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్స్, ఏజెన్సీల పేరుతో లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లు ధ్రువీకరణ కావడంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
Also Read
- Tags
- Basara Scam
తాజావార్తలు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!