Nizamabad: అయ్యో దేవుడా.. పాముకాటుతో మూడేళ్ల చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషసర్పాలు, తేళ్లు అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. చీకటి, వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు జనావాసాల్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసరాలను చెత్తాచెదారం, చిందరవందరగా వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ఇంట్లోకి జీవాలు రాకుండా గుంతలుంటే తలుపులు మూసేయాలని సూచించారు. కవరింగ్ దుప్పట్లు మరియు వస్తువులను రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. చీకటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిదని.. అలాగే కార్లు, బైక్లు, హెల్మెట్లు తదితర వాటిని తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి వినియోగించాలి. అయితే ఓ కుటుంబం చేసిన నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. రెండు పాములు కాటువేయడంతో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆస్పత్రిలో చేర్పించి మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
Read also: Minister RK Roja: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ, పార్టీ ఎందుకు పెట్టారో పవన్కే తెలియదు..
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
నవీపేట్ మండలానికి చెందిన బినోస్ దంపతులు మంగళి భూమయ్య, హర్షిత. వీరికి కుమారుడు రుద్రాంశ్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లోని ఓ గది కూలిపోయింది. దీంతో శుక్రవారం భూమయ్య కుటుంబం పక్కనే ఉన్న మరో గదిలో పడుకుంది. గాఢ నిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాంశ్ను కాటేశాయి. బాలుడు నిద్రలో బిగ్గరగా ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది లేచారు. తమ కుమారుడికి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇంతలో భూమయ్య బాలుడి సమీపంలోకి రెండు పాములు కదులుతున్నట్లు గమనించాడు. వెంటనే కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Minister RK Roja: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. కానీ, పార్టీ ఎందుకు పెట్టారో పవన్కే తెలియదు..
తాజావార్తలు
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!