Medtronic’s: హైదరాబాద్ కు క్యూకడుతున్న విదేశీ కంపెనీలు.. రూ.3 వేల కోట్లతో ఆర్ అండ్ డీ సెంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medtronic’s: తెలంగాణ రాష్టానికి విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. అయితే.. హైదరాబాద్లో మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో మెడ్ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. మెడ్ట్రానిక్స్ నిర్ణయంపట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలివస్తున్నాయనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే.. అమెరికా వెలుపల వెడ్ట్రానిక్స్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తుండటం విశేషం.
Read also: Toyota: టయోటా కీలక నిర్ణయం.. ఇక, నో వెయిటింగ్..!
Also Read
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారతదేశం గ్లోబల్ హబ్గా ప్రసిద్ధి చెందిందని మెడ్ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & ప్రెసిడెంట్ మైక్ మరీనారో అన్నారు. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కోసం వృద్ధి చెందుతున్న మార్కెట్గా భారతదేశ సామర్థ్యాన్ని విశ్వసిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మెడ్ట్రానిక్కు వ్యూహాత్మక ప్రదేశంగా నిరూపించబడిందని అన్నారు. దేశంలో ఈ ప్రధాన పెట్టుబడిపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి , రోగుల ఫలితాలను మెరుగుపరిచే వినూత్న పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ & MEIC సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషి మాట్లాడుతూ.. హెల్త్కేర్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్, పురోగతికి ఆర్ అండ్ డిలో పెట్టుబడి పునాదని అన్నారు. ఇది రోగి ఫలితాలను మెరుగుపరచడానికి, ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి, ఆర్థిక వృద్ధిని నడపడానికి మాకు సహాయపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్, హెల్త్కేర్ ఎకోసిస్టమ్ ఎనేబుల్గా నిలిపాయని అన్నారు. అందుకే టెక్నాలజీ పైప్లైన్కు దోహదపడే కార్యకలాపాలతో ఇన్నోవేషన్కు ఆజ్యం పోసి, మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పెట్టుబడి కేంద్రానికి గొప్ప సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుందని అన్నారు.
Ecstatic to welcome one of the country’s largest investments of more than USD 350 mn (INR 3000 Cr approx) in the medical devices sector 😊
Thank you @Medtronic for choosing Hyderabad as your base, this further strengthens Telangana's position as a global hub for medical devices… pic.twitter.com/3pItimAZk1
— KTR (@KTRBRS) May 18, 2023
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!