KA Paul: చూసారా ఇదీ నా పవర్.. నావల్లే ఇదంతా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ప్రజలు ఓడిస్తారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరేందుకు ఏప్రిల్ 30 వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారా అని ప్రశ్నించగా, 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నిజాయితీపరులు, నైతికత ఉన్నారని పేర్కొన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ పార్టీలో చేరారని.. ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా చేరారని గుర్తు చేశారు.
Read also: 11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
అంబేద్కర్ జయంతి రోజున సచివాలయాన్ని తెరవాలని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. ఆయన వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంటున్నారు. చూసారా ఇదీ నా పవర్ అంటే.. ఇదంతా నావల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే విచారణ కొనసాగుతున్నందున వాయిదా వేసినట్లు తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభోత్సవం జరగలేదన్నారు. ఢిల్లీ పర్యటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. మరికొందరు ప్రముఖులను కలవాల్సి ఉందన్నారు. తెలంగాణలో బడుగులకు అధికారం వస్తుందని.. ఆ తర్వాత కేంద్రంలోనూ అధికారం వస్తుందని అన్నారు.
Read also:Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 27 ఫైరింజన్లు
ఏ విషయం వచ్చినా తగ్గుముఖం పడుతుందని కేఏ పాల్ స్పష్టం చేశారు. తమ పార్టీ గుర్తు అంశం హైకోర్టు పరిధిలోనిదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు అంశాలపై తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. పార్టీ గుర్తు విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రైతులకు, సచివాలయానికి న్యాయం జరిగిందని కామారెడ్డి అన్నారు. బీజేపీని ఓడించడం ఖాయమని కేఏ పాల్ స్పష్టం చేశారు. మోదీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు లక్షా 56 వేల కోట్లు అప్పు చేస్తే.. మోదీ రెట్టింపు చేశారని అన్నారు. 8 ఏళ్లలో 118 లక్షల కోట్ల అప్పులు చేశారని గుర్తు చేశారు. అదానీ వెనుక మోడీ హస్తం ఉందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తే ఆపేస్తానని పేర్కొన్నారు. ఇదే విషయమై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాలను కలిసి విన్నవించామని చెప్పారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?