TSRTC: నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహిళలకు ఫ్రీ జర్నీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించి లక్షలాది మంది మహిళా ప్రయాణికులు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల ఏర్పాటుకు టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 22 కొత్త బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
Read also:Kishan Reddy: జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది..!
Also Read
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
మొత్తం 500 బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు, అవి ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇవి పూర్తిగా నాన్ ఏసీ బస్సులు. పాత మెట్రో ఎక్స్ప్రెస్ స్థానంలో ఈ బస్సులను తీసుకొస్తున్నట్లు గ్రేటర్ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో కూడా మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు నడపనున్నారు. బిహెచ్ఇఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్సియు, రాణిగంజ్ డిపోల వద్ద బస్సులను ఛార్జ్ చేసేందుకు 33 కెవి విద్యుత్ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రత్యేకంగా 565 డీజిల్ బస్సులను అందజేస్తోంది. 125 మెట్రో డీలక్స్లు ఉంటాయని అధికారులు తెలిపారు. జూన్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ప్రెస్, 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి, ఇందులో పురుషులతో పాటు మహిళలకు కూడా సీట్లు దొరుకుతాయని తెలిపారు. అంతేకాకుండా.. మహిళలకు ఫ్రీ జర్నీతో పురుషులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమమంలో.. ఇందులో పురుషులకు కూడా సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
Houthi Rebels: హౌతీ రెబల్స్పై అమెరికా, యూకే స్ట్రైక్స్.. 11 మంది మృతి
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!