TSRTC: ఆర్టీసీ రికార్డ్ బ్రేక్.. మహాలక్ష్మీ పథకం ద్వారా 15 కోట్ల మంది ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: మహాలక్ష్మీ పథకం ద్వారా 15 కోట్ల మహిళా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు. ఈ సందర్బంగా పీవీ మార్గ్ లో కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ఆర్టీసీలో మహిళా ప్రయాణికులు 15 కోట్ల మంది ప్రయాణించడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ సంబురాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి రోజు రోజుకు స్పందన పెరుగుతోంది.
మహాలక్ష్మీ పథకం మొదలైన 11 రోజుల్లోనే లక్షల మంది ఉచిత ప్రయాణం చేశారు. పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల బస్సులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి.
Read also: Elon Musk Phone: ఫోన్ స్విచ్ ఆఫ్ చేయనున్న ఎలాన్ మస్క్.. కాల్స్, మెసేజ్ ఎలా చేస్తాడంటే ?
Also Read
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
- Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
- Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్పై బిగ్ ప్రశ్న.!
త్వరలో 2 వేల బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఇందులో 1000 డీజిల్, 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ఎండీ సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి లాభాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సుమారు రెండు నెలల వ్యవధిలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఛార్జీల కింద రూ.535.52 కోట్లు ఆదా చేశారని సజ్జనార్ వివరించారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ బస్సులో 90 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీ రేటు నమోదు కావడం గమనార్హం.
US Presidential Election 2024: మరో ప్రైమరీలో డోనాల్డ్ ట్రంప్ విజయం..
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!