Ayodhya Ram Mandhir: హైదరాబాద్ నుంచి అయోధ్యకు.. 1,265 కిలోల భారీ లడ్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandhir: అయోధ్య శ్రీరాముడి దగ్గర హైదరాబాద్లో భారీ లడ్డూలు తయారయ్యాయి. హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారిలు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 1,265 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వారు దానిని అయోధ్యకు పంపుతారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వరకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే నెంబరుతో లడ్డూను తయారు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డూ శోభాయాత్ర ప్రారంభించారు. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి చంపత్రాయ్ను సంప్రదించి అనుమతి పొందారు. ఆయన సూచనలతో 1,265 కిలోల బరువున్న లడ్డూలను తయారు చేశామన్నారు.
Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
Also Read
- Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రి..
విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రిని పంపారు. బషీర్ బాగ్లోని శ్రీ నాగలక్ష్మీ మాత దేవాలయం నుండి అయోధ్య ధామ్ వరకు వెళ్తున్న ప్రసాద సామగ్రి వాహనాన్ని జెండాను ఎగురవేశారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు మాట్లాడుతూ దాతల సహకారంతో 45 రోజులపాటు నిత్యం 5 వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అయోధ్యలో అన్నదానం కోసం కమిటీని నియమించింది. ఈ కార్యక్రమం సంక్రాంతి (14) నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగింది. హైదరాబాద్ నుంచి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు వాలంటీర్లుగా అయోధ్య వెళ్తున్నారని తెలిపారు. అలాగే రోజూ 35 మంది వంటవాళ్లు వండి వడ్డించబోతున్నారు. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్డులో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆహార తయారీకి అవసరమైన 40 టన్నుల వివిధ సామాగ్రిని ఇప్పటికే సేకరించి అవసరమైన దాతల నుండి పంపినట్లు రామారావు తెలిపారు.
Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!