10th answer sheets Missing: ఆదిలాబాద్లో పదోతరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10th answer sheets Missing: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది. పోస్టు ఆఫీస్ నుంచి బస్టాండ్ కు తరలిస్తుండగా ఒక్క కట్ట జవాబు పత్రాలు మిస్ అయినట్లు తెలిపారు. ఆటోలో తరలిస్తుండగా మిస్ అయినట్టుగా పోస్ట్ మాస్టర్ హరీష్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లను అధికారులకు ఫిర్యాదు చేశారు. మాయమైన జవాబు పత్రాల కట్టలో సుమారు 30 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎవరు జవాబు పత్రాలను కొట్టేశారు. ఆటోలో తరలిస్తున్నప్పుడే మిస్ అయ్యాయా? లేక ఆటో ఎక్కడైన ఆపడం వలన ఎవరైనా పేపర్ల కట్టను దొంగలించారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, తనతో పాటు ఆటోలో వెళ్లిన వారిని, పాఠశాలనుంచి ఆన్సర్ సీట్ పేపర్ల కట్టను ఎవరు ఆటోలో పెట్టారో వారిని విచారించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read also: Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేయగా.. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. కాసేపటికే 9.37 గంటలకు బందెప్ప మరో ఉద్యోగి సమ్మప్పకు వాట్సాప్ పంపించారని వెల్లడించారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందన్నారు. నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని.. నేటి నుంచి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.
Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!