NTV Telugu Site icon

Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి.

తెలంగాణలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి పది వేలకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులన్నీ భర్తీ అయతే తెలంగాణలో పోలీస్‌ శాఖ తర్వాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉండనున్నాయని సమాచారం.