జియోటెల్ OS, HDR10+ డిస్ప్లేతో మొదటి QLED టీవీలను లాంచ్ చేసిన Thomson!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thomson: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా థామ్సన్ సంస్థ భారతదేశంలో కొత్త 50, 55 అంగుళాల జియోటెల్ OS QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. భారతదేశంలో జియోటెల్ OSతో టీవీలను ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ థామ్సన్. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. జియో రూపొందించిన భారతదేశపు స్వంత స్మార్ట్ టీవీ ప్లాట్ఫారమ్ అయిన జియోటెల్ OSతో ఈ కొత్త టీవీలు వస్తున్నాయి. ఇవి భారతీయ గృహాలకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
కాలేయాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యంగా ఉంచే రహస్య ఆహారాలు: ఇవి తప్పక తినండి!
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
ఈ టీవీలు బెజిల్-లెస్ డిజైన్, ప్రీమియం అలాయ్ స్టాండ్లతో వస్తాయి. ఇవి 1.1 బిలియన్ రంగులతో, HDR10+తో కూడిన QLED 4K డిస్ప్లేను (3840 × 2160 పిక్సెల్స్) కలిగి ఉంటాయి. దీని బ్రైట్నెస్ 450 నిట్స్ వరకు ఉంటుంది. ప్రత్యక్ష మ్యాచ్లను మెరుగ్గా చూసేందుకు ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. ఇంకా కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్, హెచ్డిఎమ్ఐ, యూఎస్బి పోర్టులు, స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉన్నాయి. 48W స్పీకర్లు డాల్బీ డిజిటల్ ప్లస్తో ఆడియో అవుట్పుట్ను అందిస్తాయి. వీటిలో ఉన్న హలోజియో అసిస్టెంట్ 10 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10+ OTT యాప్ల నుంచి మీకు నచ్చిన వాటిని సిఫార్సు చేస్తుంది. వీటికి 1 సంవత్సరం వ్యారేంటి లభించనుంది.
ఈ థామ్సన్ టీవీలలో ఆమ్లాజిక్ చిప్సెట్ ఉంది. దీనికి 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. 50 అంగుళాల (50TJQ002) టీవీ రూ. 19,999కు, 55 అంగుళాల (55TJQ0032) టీవీ రూ. 25,999కు లభించనుంది. ఇక లాంచ్ ఆఫర్స్ కింద 3 నెలల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 1 నెల జియోగేమ్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఉంటుంది. యాక్సిస్, ఐసిఐసిఐ కార్డ్ యూజర్లకు కనీసం 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలు సెప్టెంబర్ 23 నుండి అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..