Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?
- ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్
- విచారణ ప్రారంభించిన భారత్ ప్రభుత్వం
- దోషిగా తేలితే నిషేధానికి కూడా గురయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించబోతోంది. దోపిడీ, జూదం మొదలైన నేర కార్యకలాపాలలో ఈ యాప్ ఉపయోగించబడుతుందో లేదో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది. మీడియా కథనాల ద్వారా ఈ సమాచారం అందింది. విచారణలో దోషిగా తేలితే నిషేధానికి కూడా గురయ్యే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొంది. కాగా.. తన ప్రైవేటు జెట్లో అజర్ బైజాన్ నుంచి పారిస్లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న సీఈవో పావెల్ దురోవ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
READ MORE: Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
- Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
కాగా.. భారతదేశంలో.. ఈ పరిశోధనను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఏజెన్సీ ద్వారా ప్రారంభించవచ్చు. టెలిగ్రామ్కు భారతదేశంలో దాదాపు 5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్ భారత్ లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఓ నివేదికల ప్రకారం.. టెలిగ్రామ్ యొక్క పీర్-టు-పీర్ (P2P) కమ్యూనికేషన్లపై భారత ప్రభుత్వ దర్యాప్తు దృష్టి కేంద్రీకరించబడుతుంది . ఇక్కడ అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
READ MORE:Badlapur Incident: బద్లాపూర్ ఘటనకు సంబంధించి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్..
పారిస్లో అరెస్ట్..
టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ను శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. బోర్గెట్ విమానాశ్రయంలో ఈ అరెస్టు జరిగింది. అప్పటి నుంచి ఈ వార్త దావానంలా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అయితే ఎలోన్ మస్క్తో పాటు పలువురు సీఈవోకు మద్దతుగా నిలవగా.. కొందరు నిరసన కూడా వ్యక్తం చేశారు. కాగా.. పావెల్ దురోవ్ను పోలీసు విచారణలో భాగంగా అరెస్టు చేశారు. ఈ పరిశోధన టెలిగ్రామ్లో మోడరేటర్ల కొరతపై దృష్టి సారించింది. మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్లో నేర కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..