EV Fires: డీఆర్డీవో రిపోర్ట్.. ప్రమాదాల వెనుక షాకింగ్ విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో వెల్లడించింది. బ్యాటరీ లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదికలో.. అదే ప్రధాన కారణమని తేలింది. ఎండాకాలం సీజన్తో ఈ ప్రమాదాలకు ఎటువంటి సంబంధం లేదని, బ్యాటరీ లోపాలు కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లను సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే ఈ వాహనాల్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారని తేల్చింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకోవడం కోసం లో-గ్రేడ్ మెటీరియల్ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించినట్టు డీఆర్డీవో కుండబద్దలు కొట్టింది.
Also Read
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
ఇదిలా ఉండగా.. లావాదేవీల్ని కేంద్రం ఎలాగైతే డిజిటలైజ్ చేసిందో, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు సంభవిస్తుండడాన్ని చూస్తుంటే.. ఆ లక్ష్యానికి చేరుకుంటారో, లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. డబ్బులకి ఆశపడి లో-గ్రేడ్ మెటీరియల్ని వాడకుండా, ఉన్నతమైన మెటీరియల్తో వాహనాల్ని అందుబాటులోకి తెస్తే.. బహుశా ఆ లక్ష్యాన్ని అందుకోవచ్చు. ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!