ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్సంగ్ గెలాక్సీ ఎం 34 అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఫోన్ మిడ్నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో లభించే ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది… ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి.. అలాగే సామ్సంగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్ జూలై 15న ప్రారంభం కానుంది. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు..
అయితే మార్కెట్ లోకి విడుదల అవ్వక ముందే ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. అలాగే ఫ్రీ ఆర్డర్లు కూడా ఎప్పుడో మొదలైయ్యాయి.. రూ.999 తో ప్రీ ఆర్డర్ చేసిన కస్టమర్ల కు రూ.1699 విలువైన 25 వాట్స్ ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ను ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది…
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ ను ఒకసారి తెలుసుకుందాం..
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోఎల్ఈడీ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ఎక్సినోస్ 1280 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో అందుబాటులో ఉంటుంది.. స్టోరేజ్ విషయానికొస్తే.. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ అంతర్గత నిల్వ. అలాగే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు విస్తరించే అవకాశం ఉంది.. డ్యూయల్ సిమ్ స్లాట్, 50 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్యూఎస్బీ టైప్-సి ఆడియో, డాల్బీ అట్మోస్, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది..