OpenAI: షాకింగ్ న్యూస్.. ఉచిత చాట్జీపీటీకి బ్రేక్.. కంపెనీ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OpenAI: చాట్జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో చాట్జీపీటీలో యాడ్స్ ప్రత్యేక్షం కానున్నాయి. ఈ విషయాన్ని ఓపెన్ఏఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ప్రకటనలు ప్రారంభం కాలేదని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపడతామని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు ఇది మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్జీపీటీకి 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉచితంగానే సేవలను వినియోగిస్తున్నారు. కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లాభాలు ఆర్జించలేకపోతోంది. అందుకే కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
READ MORE: PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్కు మోడీ.. వందే భారత్ స్లీపర్ను ప్రారంభించనున్న ప్రధాని
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
- Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ఇక నుంచి చాట్జీపీటీ సమాధానాలు ఇచ్చే ముందు ప్రకటనలు ప్రత్యేక్షమవుతాయని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై కంపెనీ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో మాట్లాడుతూ.. యూజర్లకు వచ్చే సమాధానాలు యథాతథంగానే ఉంటాయని చెప్పారు. ఎవరైనా అడిగే ప్రశ్నలకు అనుగుణంగా వారికి కావాల్సిన ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలు చూయిస్తామని.. అది కూడా చాట్జీపీటీ ఇచ్చిన సమాధానాల కింది భాగంలో యాడ్స్ వస్తాయన్నారు. కాగా.. డిజిటల్ ప్రకటనల రంగంలో ఇప్పటికే గూగుల్, మెటా వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తమ ఏఐ సేవల్లో ఇప్పటికే ప్రకటనలను భాగంగా చేసుకున్నాయి. మొదట ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏఐని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఓపెన్ఏఐ, గత ఏడాది తన వ్యాపార నిర్మాణాన్ని మార్చుకుని పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్గా మారింది. అయితే ఈ నిర్ణయంపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలు, సలహాల కోసం చాట్బాట్లను ఉపయోగించే వినియోగదారుల నమ్మకాన్ని ప్రకటనల కోసం వాడుకోవడం ప్రమాదకర మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు గతంలో ఇదే దారిలో వెళ్లాయని, దాని ప్రభావాలు అందరికీ తెలిసినవేనని వారు అంటున్నారు.
తాజావార్తలు
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..