Congress: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందు కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ 5 హామీలను ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్ భన్వారాలో ప్రకటించారు. ఇదే కాకుండా పేపర్ లీక్స్పై చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.