బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విజయవాడ పోలీసులకు పట్టుబడ్డ తన అనుచరులను విడిపించుకునేందుకు అర్దరాత్రి సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎంపీ సమక్షంలోనే ఆయన అనుచరులు పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఆయన అనుచరుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…