ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ నామస్మరణే మార్మోగిపోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగాడు. మీడియా చేస్తున్న అతి, సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా థియేటర్ల ఇబ్బందులు, నిర్మాతలు, సినీ కార్మికుల కష్టాలను ఏకరువు పెట్టారు. కాగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపై చేసిన…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో పిచ్చి, ఉన్మాదం పరాకాష్టకు చేరిందనిపిస్తోందని.. కానీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క సలహా ఇచ్చింది లేదన్నారు. ఇంత దిగజారి సంస్కార హీనంగా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడలేదన్న ఆయన.. ఒక విజన్ లేకుండా… నాకేదో వ్యూహం ఉంది అని గొప్పగా చెప్పుకోడానికి ప్రయత్నం చేశారని సెటైర్లు వేశారు.…
బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ విపక్షాలకు ఓ ఆఫర్ ఇచ్చింది. సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలులో పోటీకి దిగకుంటే మంచిదన్నది ఆ ఆఫర్ సారాంశం. ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. ఆ ఆఫర్ను స్వీకరించి పోటీ, ప్రచారం జంఝాటాలు లేకుండా గౌరవంగా తప్పుకొంటుందా? లేక తిరుపతిలాగే సై కొడుతుందా? 2019లో బద్వేలులో వైసీపీకి 44 వేల ఓట్ల మెజారిటీ..! అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో కడప జిల్లా బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 30న ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించడానికి…
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ నేతలకు భయం ఏంటో నేర్పిస్తానని…. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. 150 దేవాలయాల పై దాడులు చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోదా..? అని నిలదీశారు. ఉదయం లేచింది మొదలు.. వైసీపీ కమ్మ కులాన్ని తిడుతుంటే.. వాళ్లు మీ వర్గాన్ని తిట్టరా..? అని నిలదీశారు. వైసీపీ నేతలకు చెబుతున్నాను.. వ్యూహం వేస్తున్నానని హెచ్చరించారు.…
ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని… పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏపీ లో వైసీపీ పాలన దారుణంగా ఉందన్నారు. రూ. 500 ఇస్తే ఏపీ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ వస్తోందని… మద్యం అమ్మకాలపై చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలపై ప్రశ్నించి ప్రతి సన్నాసితో తిట్టించుకోవడం తన సరదానా..? ఇక్కడ పుట్టి…
సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా?అని ప్రశ్నించారాయన. జుగుప్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ ఎందుకు బహిరంగంగా వారించలేదు?అని నిలదీశారు. సామాన్యులు వినలేని..మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన ఆన్లైన్ టికెట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే….ఇలాంటి తరుణంలో మచిలీ పట్నంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య,సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంగళవారం మంత్రి నానికి ఫోన్ చేసి..…
అమరావతి : జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ అని… స్వప్రయోజనాల కోసం ప్రధాని మోడీని పవన్ కలవలేదన్నారు నాదెండ్ల మనోహర్. ఇతర ప్రతిపక్షాల గురించి మనకు అనవసరం.. తామే ప్రతిపక్షమన్నారు. ఇసుక, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాల విషయంలో గట్టిగా పోరాడింది జనసేనేనని… జగన్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.కోవిడ్ సందర్భంలో ఒక్క చోటైనా సీఎం జగన్…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది పెద్దగా లేదు. అనునిత్యం ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టిసారించారు. ఆయన పాలనపై ప్రజలు సంతృప్తి చేస్తుండగా పార్టీలో మాత్రం కొంత గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని దూరం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వరుసగా అపాయింట్మెంట్ ఇస్తూ నేతల మధ్య విబేధాలు దూరం చేసేలా…
వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ. రమణారెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అటు రమణా రెడ్డి మృతి పట్ల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రగాఢ…