Tarique Rahman: బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్లుగా బంగ్లాలో ఉన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడైన రెహ్మాన్ బంగ్లా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్ తరుపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లా ప్రధానికి భారత ప్రధాని నరేంద్రమోడీ రాసిన లేఖను అందచేశారు. Read…
Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు.
S.Jaishankar : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విదేశాంగ విధానం, దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.