Indus Water Treaty: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తరుణంలోనే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా భారతదేశానికి వచ్చారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే, భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు ‘‘వరల్డ్ బ్యాంక్’’ దూరంగా ఉంది. ‘‘ప్రపంచ బ్యాంక్కి సహాయకుడి పాత్రకు మించి ఎలాంటి పాత్ర లేదు’’ అని అజయ్ బంగా చెప్పారు.