ప్రస్తుతము నైరుతి రుతుపవనాల ఉపసంహరణ లైన్ 27.1° N అక్షాంశము/84.7° E రేఖాంశము, మోతిహరి, గయా, డాల్టోంగాంజ్, అంబికాపూర్, మండలా, ఇండోర్, గాంధీనగర్, రాజ్కోట్ మరియు పోర్బందర్ల గుండా వెళుతుంది. రాబోయే 2-3 రోజుల్లో గుజరాత్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల నుండి; మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్లోని చాలా ప్రాంతాలు నుండి; మహారాష్ట్ర, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి. ఉత్తర అండమాన్ సముద్రము మరియు దాని…
నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు కోస్తా తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 5.8 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు(పైకి) వెళ్ళే కొలది నైరుతి దిశ వైపు వంగి కొనసాగుతున్నది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి పైన తెలిపిన కోస్తా తమిళనాడులో గల ఉపరితల ఆవర్తనం నుండి ఆగ్నేయ అరేబియా సముద్రము వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 km నుండి 3.1 km ఎత్తుల మధ్య…
బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారనుంది తీవ్ర వాయుగుండం. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 17కి.మీ వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండంతుఫాన్ గా మారి రేపు సాయంత్రం కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరికలు జారీ చేసారు వాతావరణ అధికారులు. గోపాల్పూర్ (ఒడిశా) కి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ &కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంలో 480 కి.మీ.దూరంలో కొనసాగుతుంది తీవ్ర వాయుగుండం. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాని ప్రభావం మొదలైంది. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందనివాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశమున్నట్లు తెలిపింది. జులై 21న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ ద్రోణి, మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు, విదర్భ తెలంగాణ రాయలసీమ మీదుగా ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా…
నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్లోని జైసల్మేర్, గంగానగర్కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్సిఆర్లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్సిఆర్లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని…
ఈ నెల 4న నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో తొలకరి వర్షాలు కురిశాయి. కాగా ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. నిన్న నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వాన జాడే లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ…
ఓ వైపు నైరుతీ రుతుపవనాలు జూన్ 3న కేరళలోకి ప్రవేశిస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎండ తీవ్రత కొనసాగింది. వివిధ జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధికంగా 35.3 నుంచి 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి తక్కువగా వీయడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాగా సముద్రం వైపు నుంచి దక్షిణ గాలులు రాష్ట్రం మీదుగా…
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల కొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి బలపడి మే 24 నాటికి తుపానుగా, తరువాతి 24 గంటల్లో అతి తీవ్రమైన తుపానుగా మారనుంది. దీంతో.. తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ…
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడనుంది. కాగా ఈ నెల 18న ‘తౌక్టే’ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లపై దీని ప్రభావం వుండనుందని తెలిపింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి…