తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ…
ఇతర రాష్ట్రాల పల్లెల కన్నా తెలంగాణ పల్లెలు నేడు బాగున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వననపర్తి జిల్లాలోని గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంజే 1 కాలువను పరిశీలించి కృష్ణా జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు ద్వారా…