తూర్పు లడఖ్లోని సరిహద్దు రేఖ వద్ద చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగిసి, చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్గా కూడా ఉన్నాయని అన్నారు.
Air Chief Marshal Vivek Ram Chaudhari: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శనివారం 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. చండీగఢ్ లో దీనికి సంబంధించిన వేడుకలు జరిగాయి. గంట పాటు 80 విమానాలతో సుఖ్నా సరస్సుపై వైమానికి విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్నికి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎఎఫ్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. చారిత్రాత్మక ‘వెపన్ సిస్టమ్ బ్రాంచ్’ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం…