Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా పార్టీకి చెందిన ఓట్లు తొలగించబడకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే టాస్క్ఫోర్స్లా ఏర్పడి పని చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో పార్టీ బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మన పార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా ప్రతి స్థాయిలో…
ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ…