Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే…
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే సిద్ధరామయ్య- డీకే.శివకుమార్ వర్గాలు రెండుగా విడిపోయాయి. ముఖ్యమంత్రి మార్పును శివకుమార్ వర్గీయులు కోరుకుంటుంటే.. అందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటుకున్నారు. సీటులోంచి దిగే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఈ పంచాయితీ ఇలా ఉంటుండగా తాజాగా కొత్త పంచాయితీ రచ్చ చేస్తోంది.