Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరో ఉద్యమం ప్రారంభమైంది.. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్’ కార్యక్రమం ఉధృతంగా మారింది. ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే వారి భూములు తిరిగి ఇవ్వాలని నిర్వాసితులు స్పష్టమైన డిమాండ్లతో ఆందోళనకు దిగారు.. Read Also: Realme Narzo 90 సిరీస్ 5G త్వరలో…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యం కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది.