బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు..
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, రేపటితో ఈ శాకంబరీ మహోత్సవాలు ముగియనున్నాయి..
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు. READ MORE: KP Sharma…
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవడంతో, ఆయనను కుటుంబ సభ్యులు అత్యవసరంగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Ariyana : బిగ్ బాస్ తో అరియానా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచే వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఆఫర్లు రావట్లేదు గానీ.. బుల్లితెరపై బాగానే ఛాన్సులు వస్తున్నాయి. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై ఛాన్సులు అందుకుంటోంది. తాజాగా తన లవ్ స్టోరీని మరోసారి చెప్పింది. నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుమే లవ్ లో పడ్డాను. అతను విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కలిశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్య స్థితి గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వల్లభనేని వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. Also…
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో నేటి నుంచి ‘వారహి నవరాత్రులు’, ‘ఆషాఢ సారె’ సమర్పణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. జూన్ 26 నుంచి జులై 4 వరకు వారహి నవరాత్రులు, జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు అమ్మవారి ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇంద్రాకిలాద్రిపై ఈరోజు ఉదయం 8 గంటలకు దేవస్థానం సిబ్బంది తరఫున ఈవో శీనా నాయక్ చేతుల మీదగా అమ్మవారికి మొదటి సారెను సమర్పిస్తారు. జూన్…