తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive…
యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది.…