Mumbai-Bound Vande Bharat Train Hits Cattle: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోెని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.