Vande Bharat Train: మరోసారి వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. ఈ సారి ఎలాగంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai-Bound Vande Bharat Train Hits Cattle: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.
Read Also: Russia: పాకిస్తాన్కు రష్యా షాక్.. డిస్కౌంట్కు చమురు ఇచ్చేందుకు నిరాకరణ
Also Read
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
రెండు నెలల క్రితం వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు రైలు ట్రాకుపైకి వచ్చిన పశువులను ఢీకొట్టింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ ఉద్వాడ మరియు వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు పది నిమిషాల వ్యవధిలోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. డెంట్ పడిన ముందరి భాగాన్ని రాత్రి వరకు మారుస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
అంతకుముందు కూడా ఇదే రూట్లో ట్రైన్ గేదెలను ఢీకొట్టింది. ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంపై చాలా మంది వందేభారత్ ట్రైన్ పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే దీనికి మరమ్మత్తులు చేసింది రైల్వే శాఖ. ఈ ఘటన తర్వాత ఇలాగే మరో రెండు ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ తరువాతి రోజు నుంచే ఇది గాంధీ నగర్- ముంబైల మధ్య పరుగులు తీస్తోంది. భారత ప్రభుత్వ రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..